నిర్మాతగా మంచు లక్ష్మి

ఇదేదో కొత్తవార్తనా? ఆమె ఎప్పుడో నిర్మాతగా సినిమాలు తీసారు కదా? అని అనేయద్దు. ఈ వార్త వేరు. మంచు లక్ష్మి ఇప్పుడు ఓ సినిమాలో నిర్మాతగా నటించబోతున్నారు. నారా రోహిత్ నటిస్తున్న కథలో రాజకుమారి సినిమాలో మంచు లక్ష్మి ఈ మేరకు జస్ట్ కొన్ని నిమషాల పాత్రను పోషిస్తారని వినికిడి. 

ఇప్పటికే ఇదే సినిమాలో ఇలాంటి గెస్ట్ రోల్స్ ను నాగశౌర్య, అదా శర్మ పోషిస్తున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి తోడయ్యారు. ఇక అవసరాల శ్రీనివాస్ కూడా ఇలాగే ఓ క్యారెక్టర్ లో కనిపిస్తారు. మరి కొందరు సినిమా జనాలు కూడా తమ రియల్ క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కథ ప్రకారం నారా రోహిత్ సినిమా నటుడు. అందుకే ఇలాంటి టచ్ క్యారెక్టర్లు చాలా అవసరం పడుతున్నాయని తెలుస్తోంది.

Show comments