ఈసారి వెంకీని టార్గెట్ చేసిన వైట్ల?

శ్రీనువైట్ల ఓ సినిమా చేశాడంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరిని టార్గెట్ చేయకుండా ఉండడు. నేరుగా చెప్పకపోయినా, సదరు ప్రముఖుడిపై సెటైర్లు మాత్రం పడిపోతుంటాయి. ఇప్పటికే పలువురు స్టార్స్ ను తన సినిమాల్లో విచ్చలవిడిగా వాడేసిన శ్రీనువైట్ల, లేటెస్ట్ మూవీ “మిస్టర్” తో వెంకటేశ్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో కమెడియన్ పృధ్వీకి ఇచ్చిన క్యారెక్టర్ పేరు లక్ష్మీతులసి.

లక్ష్మి అనేది వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా పేరు. తులసి కూడా వెంకీ నటించిన హిట్ సినిమానే. ఇప్పుడీ రెండు సినిమా పేర్లను కలిపి పృధ్వి క్యారెక్టర్ కు పెట్టారు. ఈ పాత్రకు పెట్టిన పేరు చూస్తుంటే, మిస్టర్ మూవీతో శ్రీనువైట్ల.. వెంకటేష్ ను టార్గెట్ చేశాడేమో అనిపిస్తోంది. 

అసలే పేరడీలకు పెట్టింది పేరు పృధ్వి. ఇప్పటికే ఎంతోమంది బడా స్టార్లను స్పూఫ్ చేసి మెప్పించాడు ఈ కమెడియన్. బాలయ్య స్పూఫ్స్ తో వివాదాలు కూడా సృష్టించాడు. ఎన్టీఆర్ స్పూఫ్ తో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి కమెడియన్ తో ఇప్పుడు వెంకటేష్ ను ఇమిటేట్ చేయించే ప్రయత్నం చేసినట్టున్నారు. మరి ఈసారి వైట్ల-పృధ్వి కలిసి కామెడీ పండిస్తారా.. వివాదం రేపుతారా.. లెట్స్ వెయిట్ అండ్ సీ...

Show comments