కోటికి పడగెత్తిన పూజా హెగ్డే?

తెలుగులో చేసినవి ముచ్చటగా మూడు సినిమాలు. అయినా కూడా పూజ హెగ్డేకు డిమాండ్ బాగానే వస్తోంది. అందుకే డిజె సినిమా తరువాత తన రెమ్యూనిరేషన్ ను కోటికి పైగానే చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే నిర్మాత ఎవరైనా, తెరవెనుక తండ్రి సురేష్ వుంటారన్న సంగతి టాలీవుడ్ లో చెప్పుకునే విషయం.

కొడుకు సినిమా విషయంలో, ఆ సినిమా భారీతనం విషయంలో బెల్లంకొండ సురేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే బోయపాటి సినిమాకు రకుల్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు పూజా హెగ్డేను సంప్రదిస్తున్నారని వినికిడి.

ఆమె కోటి రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్ అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా చర్చలు పూర్తి కాలేదని, ఫిక్స్ కాలేదనీ అంటున్నారు. మరోపక్క ఫిక్స్ అయిపోయిందని, కోటికి పైగా రెమ్యూనిరేషన్ కింద సెటిల్ అయిందని అంటున్నారు. ఏమైనా టాలీవుడ్ ను హీరోయిన్ల కొరత పట్టి పీడిస్తోంది. దీంతో రేట్లు కోట్లు దాటుతున్నాయి.

Show comments