సేమ్ టు సేమ్ శ్రీమంతుడే

శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి మహేష్–కొరటాల  కలిసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం శ్రీమంతుడు సెంటిమెంట్స్ నే రిపీట్ చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్ క్యారెక్టర్ ను శ్రీమంతుడిగా (కోటీశ్వరుడు) తీర్చిదిద్దాడట. లండన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చే ఎన్నారై ధనవంతుడిగా మహేష్ ఇందులో కనిపించనున్నాడట.

ఈ సెంటిమెంట్ తో పాటు దేవిశ్రీప్రసాద్ సెంటిమెంట్ ను కూడా రిపీట్ చేస్తున్నాడు కొరటాల. శ్రీమంతుడు సినిమాకు డీఎస్పీనే సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా అతడే ట్యూన్స్ ఇస్తున్నాడు. నిజానికి ఇప్పటివరకు కొరటాల తీసిన ప్రతి సినిమాకు దేవిశ్రీనే సంగీతం అందించాడు. ఆ సెంటిమెంట్ కూడా ఇలా వర్కవుట్ అయిందని అనుకోవచ్చు.

ఈ సెంటిమెంట్స్ కు తోడు, శ్రీమంతుడు సినిమాకు సంబంధించి మరో సెంటిమెంట్ కూడా ఫాలో అయిపోవాలని ఫిక్స్ అయిపోయాడు కొరటాల. శ్రీమంతుడు సినిమాలో మహేష్ సరసన మెరిసిన శృతిహాసన్ నే “భరత్ అనే నేను” సినిమాకు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట. శ్రీమంతుడులో ఓ సందేశాన్నిచ్చినట్టే.. భరత్ అనే నేను మూవీలో కూడా ఓ సోషల్ మెసేజ్ ను ఇవ్వాలనుకుంటున్నాడట కొరటాల.

Show comments