నిర్మాతగా మారుతున్న మరో పీఆర్వో

సినిమా రంగంలోకి మొహానికి రంగేసుకుంటే, ఎప్పటికైనా హీరో కావాలని వుంటుంది. టెక్నికల్ ఫీల్డ్ లోకి వస్తే ఎప్పటికైనా డైరక్టర్ కావాలనే అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ సైడ్ కు వస్తే, ఎప్పటికైనా నిర్మాత కావాలని అనుకుంటారు. తప్పదు, సినిమా రంగంలో వున్న అట్రాక్షన్, క్రేజ్ అలాంటిది.

సినిమా రంగంలోకి అనేక మంది జర్నలిస్టులు, రచయితలుగా, డైరక్టర్లుగా, నటులుగా ఇలా ఎంటర్ అయిన వాళ్లు వున్నారు. వీరిలో కొందరు పీఆర్వోలుగా కూడా ఎంటర్ అయిన వాళ్లు వున్నారు. కానీ వాళ్లలో నిర్మాతలుగా మారిన వారు చాలా తక్కువ. సీనియర్ అండ్ పాపులర్ పీఆర్వో బిఎ రాజు మాత్రం సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కూడా ఆయన భార్య జయ డైరక్షన్ లోనే సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు మరో పీఆర్వో ఫుల్ ప్లెడ్జెడ్ నిర్మాతగా మారుతున్నారు. ప్రస్తుతం ఎన్ఎటి ఆర్ట్స్, ఆర్కేమీడియా పీఆర్వో వ్యవహారాలు చూస్తున్న మహేష్ కోనేరు నిర్మాతగా మారుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ రిజిస్టర్ చేసారు. దీనిపై కాస్త భారీ సినిమాలే తీసే ఉద్దేశంతో వున్నారట. ఈ బ్యానర్ ను ఈ వారంలో ఫ్రారంభించి, త్వరలో ఫస్ట్ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారట.

Show comments