చాలాకాలం క్రితం విక్రమ్ హీరోగా తమిళంలో వచ్చిన 'సామి' చిత్రం అప్పట్లో చాలా పెద్ద విజయాన్నే అందుకుంది. అదే సినిమా తెలుగులోకి బాలకృష్ణ హీరోగా 'లక్ష్మీనరసింహా' పేరుతో రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. తమిళ 'సామి'లో త్రిష హీరోయిన్ కాగా, తెలుగు 'లక్ష్మీనరసింహ'లో అసిన్ హీరోగా నటించింది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, 'సామి' సినిమాకి సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష పేరు ఖరారయ్యింది కూడా. ఈ విషయాన్ని దర్శకుడు హరి ఇప్పటికే ప్రకటించాడు. అయితే, అనూహ్యంగా ఈ సినిమా కోసం హీరోగా కీర్తి సురేష్ పేరుని తెరపైకి తెచ్చారు. దాంతో, త్రిష ఆనందం ఆవిరైపోయింది. అయితే ముందుగానే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ప్లాన్ చేశారనీ, త్రిషకి చిన్న పాత్రే డిజైన్ చేశారనీ, మెయిన్ హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించగా, కీర్తి సురేష్ పేరు ఫైనల్ అయ్యిందన్నది తాజాగా విన్పిస్తోన్న కథనాల సారాంశం.
మరోపక్క, 'సామి-2'లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి, ఇలా తేడా కొట్టేయడంతో త్రిష గుస్సా అవుతోంది. ప్రస్తుతం తనకు ఛాన్సులకు కొదవేమీ లేదంటోన్న త్రిష, 'సామి-2' గురించి ఇప్పుడేమీ కామెంట్ చేయబోనని స్పష్టం చేసేసింది. నిజమే, త్రిష చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ఈ ఏడాది త్రిష నటించిన మూడు సినిమాలు విడుదలవుతున్నాయి కూడా. అయినాసరే, 'సామి-2' సినిమాలో ఛాన్స్ చిన్నదేమీ కాదు కదా.!