ట్వీట్లదేముంది.. ఎక్కడినుంచైనా చెయ్యొచ్చు. సినిమా షూటింగ్ అలా కాదు కదా, ఎక్కడ ప్లాన్ చేస్తే ఎక్కడే అందులో పాల్గొనాల్సి వుంటుంది. సినీ నటుడు, జనసేన అధినేత, పవర్స్టార్ పవన్కళ్యాణ్, 'కాటమరాయుడు' సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు. మామూలుగా కాదు, క్షణం తీరిక లేనంత బిజీగా వున్నాడక్కడ. అదే సమయంలో, పవన్కళ్యాణ్ ట్విట్టర్ని కూడా వదలడంలేదు. గత కొద్ది రోజులుగా పవన్ ట్విట్టర్ పిట్ట భలేగా సందడి చేసేస్తోంది. తాజాగా, ఈరోజూ పొద్దున్నే 'ట్వీటింగ్' మొదలెట్టేశాడు. ఉదయం నుంచీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నాలుగు ట్వీట్లేశాడు. ‘ఆంధ్రులు ఈ దేశ ప్రజలు.. కేంద్రంలో వుండే నాయకులకి, పార్టీలకి బానిసలు కారు..’ అంటూ కడిగి పారేశారు. ఇంకా ట్వీట్లేస్తూనే వున్నారు.
రేపు విశాఖలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం 'ఆంధ్రప్రదేశ్ యువత' భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి పవన్కళ్యాణ్ మద్దతునిచ్చాడు. అందులో పాల్గొంటాడా.? లేదా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. మరోపక్క, 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ కోసం హైద్రాబాద్ శివార్లలోని ఓ దేవాలయంలో సందడి చేస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో పవన్కళ్యాణ్ హీరోగా 'కాటమరాయుడు' చిత్రాన్ని శరద్మరార్ నిర్మిస్తోన్న విషయం విదితమే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
మొత్తమ్మీద పవన్ 'కాటమరాయుడు' సినిమా షూటింగుల్లో బిజీగా వుంటూనే, 'ప్రత్యేక హోదా'పై ట్వీటింగుల్లోనూ బిజీగానే వున్నాడన్నమాట. సినిమా షూటింగ్లో బిజీగా వున్న పవన్, దానికి బ్రేక్ ఇచ్చి రేపటి విశాఖ 'కార్యక్రమం'లో పాల్గొంటాడా.? అభిమానులైతే, తమ అభిమాన హీరో పాల్గొంటాడనే చెబుతున్నారు.. సోషల్ మీడియాలో అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, 'మీ నాయకులు, మీ హీరోలు వస్తారా మరి.?' అంటూ సవాల్ విసురుతున్నారు. మరి, పవన్ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.