మరోసారి ముంబయికి మహేష్...

మురుగదాస్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ముంబయికి చక్కర్లు కొడుతూనే ఉన్నాడు మహేష్. ముంబయి బ్యాక్ డ్రాప్ లో బిజినెస్ మేన్ సినిమా చేసినప్పుడు కూడా ఇంతలా ఎప్పుడూ తిరగలేదు. ఆ సినిమాను దర్శకుడు పూరి జగన్నాధ్ కేవలం 50 రోజుల్లో పూర్తిచేశాడు మరి. కానీ ఇక్కడున్నది పూరి జగన్నాధ్ కాదు, మురుగదాస్. అందుకే మరోసారి ముంబయి షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు మహేష్. 

ప్రస్తుతం మహేష్-మురుగదాస్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రోజురోజుకు ఎండలు పెరిగిపోతుండడంతో.. యూనిట్ అంతా కలిసి నైట్ షూట్ ప్లాన్ చేశారు. పైగా భారీ ఏసీ సెట్ వేశారు. సౌతిండియన్ సినిమాలోనే లావిష్ గా డిజైన్ చేసిన అతితక్కువ సెట్స్ లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ఈ భారీ సెట్ లో మహేష్ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ముంబయికి మకాం మారుతుంది.

మహేష్-మరుగదాస్ సినిమా షూటింగ్ మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 2 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఏదేమైనా జూన్ 23 నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు దర్శకుడు. ఈ మూవీ రిలీజ్ కాకముందే... కొరటాల శివతో కలిసి ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు మహేష్.

Show comments