ఐటమ్‌ బాంబ్‌ పబ్లిసిటీ పైత్యం

రాఖీ సావంత్‌ ఐటమ్‌ బాంబ్‌లా వెండితెరపై ఏ స్థాయిలో రాణించింది.? అన్న విషయం పక్కన పెడితే, పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో బహుశా ఆమెకు సాటి ఇంకెవరూ రారేమో. ఆ మాటకొస్తే, పబ్లిసిటీ స్టంట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆమెను చెప్పుకోవాలేమో. వయసు మీద పడ్డా, ఆమె తనలో గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదని ఇంకా ఇంకా ఆరాటం ప్రదర్శిస్తూనే వుంటోంది. 

ఇక, రాఖీసావంత్‌ అంటే పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే కాదు, వివాదాలు కూడా. తాజాగా, ప్రీ ఇండిపెండెన్స్‌ డే పార్టీ కోసం ఓ వెరైటీ డ్రస్సులో హాజరయ్యింది రాఖీ సావంత్‌. సహజంగానే ఆమె తన అందాల్ని బహిర్గతం చేస్తూ నానా హంగామా చేసింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్‌ కూడా వుంది. ఆమె డ్రస్‌ చూసి అంతా షాక్‌కి గురయ్యారు. కారణం, ఆమె డ్రస్‌ నిండా ప్రధాని నరేంద్రమోడీ ఫొటోలు వుండడమే. 

అక్కడా ఇక్కడా అని కాదు, ఆఖరికి పిరుదుల మీద కూడా నరేంద్రమోడీ ఫొటో.. వుండకూడని చోట వుంది. దాంతో, మోడీ అభిమానులు గుస్సా అవుతున్నారు. రాఖీ సావంత్‌ మాత్రం 'అందం చూడవయా.. ఆనందించవయా..' అంటోంది. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అంతే మరి, రాఖీ సావంత్‌ ఏం చేసినా వివాదమే. ఆ వివాదాలే ఆమెకు పబ్లిసిటీ ఇస్తున్నాయి. అవే, ఆమె కెరీర్‌ అటకెక్కిపోయినా, ఆమెను వార్తల్లో నిలబెడ్తున్నాయి. దటీజ్‌ రాఖీ సావంత్‌.

Show comments