పవన్ కల్యాణ్ .. కౌంటర్ అటాక్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్లపై భారతీయ జనతా పార్టీ స్టేట్ లీడర్లు ఎవరూ పెద్దగా రియాక్ట్ కావడంలేదు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో.. ఒకరిద్దరు స్టేట్ లీడర్లు రియాక్ట్ అయ్యాకా, మరీ ఓవర్ గా రియాక్ట్ కావొద్దని.. పవన్ మానాన ఆయనను వదిలేయాలని అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.

అయితే.. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సిద్ధార్థ్ సింగ్ మాత్రం పవన్ ట్వీట్లపై స్పందించాడు. పవన్ కు కౌంటరిచ్చాడు. పవన్ ముందుగా రాజ్యాంగ అవగాహన పెంపొందించుకోవాలని..పవన్ ది అవగాహన రాహిత్యం అని ఆయన అన్నాడు.

ఈ నేపథ్యంలో పవన్ తన తాజా ట్వీట్లలో సిద్ధార్థ్ కు కౌంటరిచ్చాడు. తనకు అవగాహన లేదని మాట్లాడుతున్న బీజేపీకి ఉన్న అవగాహన ఏమిటి? అని పవన్ ప్రశ్నించాడు. మీ పార్టీలో రాజకీయ అనుభవజ్ఞులు ఉండి, రాజ్యాంగ నిష్ణాతులు ఉన్నా.. నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదానికి ఎలా పాల్పడ్డారు? ఏ తప్పు చేయకుండా ఇంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పుతున్న నేపథ్యంలో దానికి ఏమని సమాధానం ఇస్తారు? అని సిద్ధార్థ్ ను పవన్ ప్రశ్నించాడు. 

పవన్ ట్వీట్లపై ఎవ్వరూ స్పందించని నేపథ్యంలో.. స్పందించిన సిద్ధార్థ్ సింగ్ కు ఇప్పుడు పవన్ నుంచి కౌంటర్ పడింది. మరి దానికి ఆయన ఏమని సమాధానమిస్తాడో!

Show comments