ప్రశాంత్ నీల్- దేవరకొండ.. అదీ సంగతి

దర్శకులు పెద్ద దర్శ‌కులుగా మారుతున్న కొద్దీ సినిమాలు తగ్గిపోతాయి. ఏడాదికి రెండేళ్లకు సినిమా అన్నట్లు వుంటుంది వ్యవహారం. కానీ అది రెండు విధాల ఇబ్బందికరమైన వ్యవహారం.

ఒకటి తాము అనుకునే ఐడియాలు అన్నీ పెద్ద సినిమాలకు సరిపోవు. కొన్ని మిడ్ రేంజ్ సినిమాలకు సరిపోతాయి. రెండవది ఆదాయం రావాల్సింది అనవసరంగా పోతుంది. అందుకే చాలా మంది దర్శకులు తమ కథలను ఇచ్చి, తమ శిష్యులనో, కొత్త దర్శకులనో ప్రోత్సహించి సినిమాలు చేయిస్తుంటారు. ఈ లైన్ లో ఇప్పటికే చాలా మంది దర్శకులు వున్నారు.

ఇప్పుడు ఈ లైన్ లోకి రావాలనుకుంటున్నారట ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా దర్శకుడు. ఐడియాలకు కొదవలేదు. నిర్మాతలకు కొదవ లేదు. కానీ ఒక్కరే ఎన్ని సినిమాలు అని తీయగలరు. అందుకే తను కథలు ఇచ్చి, కేజిఎఫ్ నిర్మాతలతో సినిమాలు చేయించాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఇటీవల విజయ్ దేవరకొండను కలిసినట్లు తెలుస్తోంది.

తను కథ ఇచ్చి, కొత్త దర్శకుడితో సినిమా చేయిస్తానని, క్వాలిటీ చెక్ అంతా తాను చూసుకుంటా అని ప్రశాంత్ నీల్ చెప్పినట్లు సమాచారం. అయితే దానికి ఇంకా ఎస్ లేదా నో చెప్పలేదు దేవరకొండ. ఎందుకుంటే సితార సంస్థకు ఓ సినిమా, దిల్ రాజు ఓ సినిమా వున్నాయి. మైత్రీ, గీతా సంస్థలకు సినిమాలు చేయబోతున్నారు. 

Readmore!

Show comments

Related Stories :