సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమా ఫిక్స్

కేశవ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మేకింగ్ బాగానే వుంది, స్క్రిప్ట్ మరి కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది అన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో ఆ సినిమా డైరక్టర్ సుధీర్ వర్మకు మరో సినిమా రావడానికి లైన్ క్లియర్ అయిపోయింది.

కేశవ సినిమా కు ముందే హీరో శర్వానంద్ కు, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు ఓ మాంచి కథ చెప్పాడు. అది వాళ్లకు నచ్చేసింది.ఇప్పుడు ఈ సినిమా పక్కా అయిపోయింది.

ఆ సబ్జెక్ట్ నిర్మాత చినబాబుకు, హీరో శర్వానంద్ కు పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మీద సుధీర్ బిజీ గా వున్నాడట. శర్వానంద్ చేస్తున్న మహానుభావుడు ఫినిష్ కాగానే, ఈ సినిమా స్టార్ట్ చేస్తారు. బహుశా ఆగస్టు నుంచి వుంటుందని తెలుస్తోంది.

Show comments