జై లవకుశలో నివేదా థామస్

జై లవకుశ ప్రాజెక్టులో ఎన్టీఆర్ సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటించనుందంటూ చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను ఇప్పటికే సెలక్ట్ చేసిన యూనిట్, రెండో హీరోయిన్ గా నివేదాను తీసుకున్నట్టు  ప్రచారం జరిగింది. ఇప్పుడది నిజమైంది. నివేద ఎంట్రీని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. తమ ట్విట్టర్ పేజ్ ద్వారా ఈ న్యూస్ పక్కా చేసిన నిర్మాత కల్యాణ్ రామ్.. నివేదను ప్రాజెక్టులోకి సాదరంగా ఆహ్వానించాడు.

తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది నివేదా ధామస్. నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తన రెండో ప్రాజెక్టును కూడా నేచురల్ స్టార్ తోనే చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎగ్రిమెంట్ పూర్తికాకపోవడంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. తాజాగా ఎగ్రిమెంట్ పూర్తయింది. త్వరలోనే తారక్ తో కలిసి సెట్స్ లో జాయిన్ కానుంది ఈ బ్యూటీ. 

బాబి దర్శకత్వంలో శరవేగంగా ముస్తాబవుతోంది జై లవకుశ సినిమా. ఇందులో ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు. వీటిలో 2 పాత్రలకు రాశిఖన్నా, నివేదా ఓకే అయ్యారు. ఇక ఆ మూడో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది.

Show comments