సీరత్ కపూర్ టచ్ చేసి చూడు

టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత తీవ్రంగా వుంది. హీరోలందరూ చకచకా సినిమాలు ఓకె చేస్తున్నారు. దీంతో ఉన్న కొద్ది మంది హీరోయిన్ల డేట్లకు కరువొచ్చి పడుతోంది. దాంతో ఎక్కడెక్కడి హీరోయిన్లకు గిరాకీ పెరిగిపోతోంది. చాన్స్ లు వచ్చి పడుతున్నాయి. రన్ రాజా రన్ లాంటి హిట్ సినిమా చేసినా కూడా హీరోయిన్ సీరత్ కపూర్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పటి నుంచి ఏడాదికి ఓ సినిమా కూడా చేతిలోకి రాలేదు.

అలాంటిది ఇఫ్పుడు అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. పివిపి సంస్థలో రాజుగారి గది 2 సినిమా చేతిలోకి వచ్చింది. దాంతో అందరి చూపులు సీరత్ పైకి మళ్లాయి. లేటెస్ట్ గా రవితేజ సినిమాలో హీరొయిన్ గా ఓకె అయిపోయింది. రవితేజ తో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ కలిసి నిర్మించే ‘టచ్ చేసి చూడు’ సినిమాలో ఆమెను ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఓకె చేసారు. ఇప్పటికే రాశీఖన్నా వుంది. రెండో పాత్రకు చాలా పేర్లు వినిపించాయి కానీ, ఆఖరికీ సీరత్ ఓకె అయింది.

ఈ రెండు సినిమాలు చాలు. అవకాశాలు వరుస పెట్టడానికి. పైగా అసలే ఈ మధ్య కాస్త స్పైసీ స్టిల్స్ కూడా వదుల్తోంది అమ్మడు. 

Show comments