అఖిలేష్ కోరిక తీరుతోంది..!

సమాజ్ వాదీ పార్టీ పరిణామాలతో కాంగ్రెస్ ఆనందంగా ఉన్నట్టుంది. కాంగ్రెస్ తో పొత్తుకు ఉబలాడపడుతున్న అఖిలేష్ యాదవ్ దాదాపు సొంత కుంపటి పెట్టుకున్నట్టుగానే కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ తో పొత్తుకు నో చెప్పిన ములాయం సింగ్ యాదవ్ మాట అఖిలేష్ వినే పరిస్థితి లేదు. కాంగ్రెస్- సమాజ్ వాదీ- ఆర్ఎల్డీలు కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అఖిలేష్ యాదవ్ కోరిక కూడా!

కాంగ్రెస్- ఎస్పీలు కలిసి పోటీ  చేస్తే.. మూడువందలకు పైగా స్థానాలు తమ సొంతం అవుతాయని అఖిలేష్ పలుసార్లు వ్యాఖ్యానించాడు. క్రితం సారి అసెంబ్లీ ఎన్నికల్లో పదే పదే రాహుల్ గాంధీపై విరుచుకుపడిన అఖిలేష్ ఇప్పుడు మాత్రం.. రాహుల్ కు ఆల్ మోస్ట్ సన్నిహితుడయ్యాడు. అయితే ఇంతజేసినా.. ఎస్పీ- కాంగ్రెస్ లస్నేహానికి ములాయం అడ్డుగానే నిలిచాడు.

అయితే ఇప్పుడు ములాయం మాట వినేది లేదని అఖిలేష్ వర్గం స్పష్టం చేస్తున్న దరిమెల.. కాంగ్రెస్ వైపు నుంచి కూడా అఖిలేష్ కు స్నేహహస్తం అందుతోంది! అఖిలేష్ తో కాంగ్రెస్ కు పొత్తు కుదిరిన పక్షంలో తను సీఎం అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటానని షీలా దీక్షిత్ ప్రకటించేసింది ఇప్పటికే! ఈ విషయంలో తనకు మొహమాటం ఏమీ లేదని ఆమె చెప్పింది. అయినా.. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండుంటే.. సీఎం అభ్యర్థిత్వానికి విలువ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆ హోదాతో అనాపైసా ఉపయోగం లేదు. దీంతో షీలా త్యాగానికి సిద్ధమని ప్రకటించేసింది!

ప్రియాంక స్థాయిలో అఖిలేష్ తో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్- అఖిలేష్ వర్గం ఎస్పీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఒక రకంగా అఖిలేష్ కోరికే ఇది. తీరుతోందిప్పుడు.. మరి ఫలితాలెలా ఉంటాయో!

Show comments