చర్చలు సఫలం: ఎన్టీఆర్, పూరి రాజీ

జై లవకుశలో 'జై' పాత్రను గతంలో ఎన్టీఆర్ కు పూరిజగన్నాథ్ చెప్పిన ఓ సినిమా కథ నుంచి కాపీ కొట్టారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2 రోజులుగా టాలీవుడ్ లో ఈ వార్త దుమారం రేపింది.

దీనిపై అటు ఎన్టీఆర్, ఇటు పూరిజగన్నాథ్ ఎవరూ ఓపెన్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మేటర్ పై ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ చర్చించుకొని రాజీకి వచ్చారట.

జై లవకుశపై వివాదాలు రేగడం ఎన్టీఆర్ కు అస్సలు ఇష్టం లేదు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న జై లవకుశ కూడా అదే రేంజ్ లో ఆడాలని కోరుంటున్నాడు తారక్.

అంతేతప్ప వివాదాలు సృష్టించాలని అనుకోవడం లేదు. అందుకే పూరితో మాట్లాడి మేటర్ సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పూరికి మరో సినిమా ఛాన్స్ ఇస్తానని కూడా ఎన్టీఆర్ మాటిచ్చినట్టు సమాచారం.

మరోవైపు పూరిజగన్నాథ్ కూడా ఈ విషయంలో కాస్త సైలెంట్ అయ్యాడు. గతంలో చిరంజీవితో చేయాల్సిన సినిమాకు సంబంధించి మీడియా ముందుకొచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి, ఎన్టీఆర్ విషయంలో మాత్రం తెరవెనకే వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై ఈ మేటర్ ను ఎక్కడా ప్రస్తావించనని తారక్ కు మాటిచ్చాడట పూరి.

ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో టెంపర్ లాంటి హిట్ మూవీ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచింది టెంపర్. కచ్చితంగా పూరిజగన్నాథ్ తో మరో సినిమా చేస్తానని, టెంపర్ టైమ్ లోనే ప్రకటించాడు ఎన్టీఆర్.

Show comments