నారా బ్రహ్మణి.. థర్డ్ పార్టీ సర్వే ఏమని చెప్పింది?

తెలుగుదేశం పార్టీ… పాలన లో దాదాపు రెండున్నర సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోంది. విభజన అనంతరం వివిధ పరిణామాల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు.. రెండేళ్లుగా సాగిస్తున్న పాలన విషయంలో ఇప్పటికే వివిధ రకాల సర్వేలు, అధ్యయనాలు.. వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిల్లో ఏదీ కూడా ఆథరైజ్డ్ సంస్థలు చేసినట్టుగా అధికారిక ధ్రువీకరణలు లేవు.

కానీ.. తన పాలన విషయంలో ఎప్పటికప్పుడు ప్రజాస్పందన తెలుసుకునే ఆసక్తి మాత్రం తెలుగుదేశం అధినేతకు ఉంది. ఇప్పటికే పలు ధఫాలుగా ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సర్వేలు చేయించుకున్నారనే మాట వినిపిస్తోంది. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఒకటీ అర సర్వేలు చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటి ఫలితాల సంగతలా ఉంటే.. ఇప్పుడు తెలుగుదేశం, మీడియా వర్గాల మధ్య నారా బ్రహ్మణి చేయించిన ప్రత్యేక సర్వే ఫలితాల గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎవరు చేయిస్తున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా ఒక థర్డ్ పార్టీ ద్వారా నారా  బ్రహ్మణి ఈ సర్వేను చేయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వే లో తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ఫలితాలే వచ్చినట్టుగా మీడియా వర్గాల మధ్య ప్రచారం జరుగుతోంది. ఇప్పటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 57 సీట్లకు మించి సాధించదని.. ఈ అధ్యయనం తేల్చిందని సమాచారం. 

బాబు పాలన విషయంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందనే విషయానికి అద్దం పడుతున్న ఈ అధ్యయన వివరాలు చంద్రబాబు దృష్టికే తీసుకెళ్లిందట బ్రహ్మణి. ఇదీ పరిస్థితి ఆమె కుండ బద్ధలు కొట్టినట్టుగా సమాచారం. బాబు పాలన మీద ప్రబలిన ప్రజా వ్యతిరేకత  ప్రతిపక్ష పార్టీకి కలిసొచ్చే అంశమే అని.. 175 లో తెలుగుదేశం ప్లస్ బీజేపీల వాటా 57 సీట్లు మాత్రమే అని.. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ జయకేతనం ఎగరేసే అవకాశాలున్నాయని ఈ సర్వేలో తేలినట్టు తెలుస్తోంది.

అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇస్తున్న సమాచారం ఇది. మీడియా ప్రతినిధులకు కూడా ఈ వివరాలపై స్పష్టత ఉంది.  ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకపోవడం, రాజధాని అంశం పూర్తిగా గందరగోళంగా మారడం, అవినీతి తారాస్థాయికి చేరడం.. కరువు పరిస్థితులు.. ఇవన్నీ కూడా బాబు పాలనపై వ్యతిరేకతను పెంచుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు కూడా. 

మరి అనుకూల మీడియాను ఆధారంగా చేసుకుని.. ఇంతలా ప్రచారం చేయించుకుంటున్నా, అంతా అదిరిపోతోందని అని చెప్పుకుంటున్నా.. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ విదేశాల పేర్లు వల్లెవేస్తున్నా.. రెండున్నరేళ్లలోనే 57 సీట్ల స్థాయికి వచ్చిందంటే.. పాలన ఎలా సాగుతోందో.. దీనిపై ప్రజలు ఏమని ఫీలవుతున్నారో.. బాబుకు కూడా పూర్తిగా స్పష్టతే వచ్చి ఉండాలి.

Show comments