పవన్ పిలుపు కోసం దీనంగా...

నిజానికి త్రివిక్రమ్ సినిమా కంటే ముందే ఆర్టీ నేసన్ తో సినిమా లాంచ్ చేశాడు పవన్ కల్యాణ్. దసరాకే ప్రారంభమైన ఈ సినిమాను పక్కనపెట్టి.. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. దీంతో నేసన్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయం పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోయింది. ఈ సినిమాను సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, ఎప్పటికప్పుడు పవన్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈమధ్య కూడా ఈ నిర్మాత కాటమరాయుడు సెట్స్ లో కనిపించాడు. అప్ డేట్ ఏంటని అడిగితే, ప్చ్ అంటూ చిన్న నిట్టూర్పు వదిలాడు. 

నిజానికి త్రివిక్రమ్ సినిమా కంటే ముందే నేసన్ మూవీ ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. పవన్ సినిమా కోసం బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధమయ్యాడు నేసన్. మరోవైపు పవన్-నేసన్ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కూడా లాక్ చేసినట్టు ప్రకటించాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఇలా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్విగ్ లో నడుస్తున్నాయి. కానీ సెట్స్ పైకి ఎప్పుడొస్తుందనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. 

కాటమరాయుడు షూటింగ్ ను క్లయిమాక్స్ కు తీసుకొచ్చిన పవన్ కల్యాణ్... వెంటనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కనీసం 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయితేకానీ, నేసన్-ఏఎం రత్నం సినిమా ఎప్పుడు పట్టాలపైకి వస్తుందనే విషయం చెప్పలేం. అయితే త్రివిక్రమ్, నేసన్ సినిమాల్ని పవన్ ఒకేసారి కంప్లీట్ చేస్తాడనే పుకారు కూడా వినిపిస్తోంది. నిజంగా ఇది పుకారే. ఎందుకంటే, ఇప్పటివరకు పవన్ ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురాలేదు. సో.. ఏఎం రత్నంకు ఇంకొన్నాళ్లు ఈ నిరీక్షణ తప్పదేమో.

Show comments