ముంబాయ్ బ్యాచ్ కు చరణ్ బై బై

తన మీడియా వ్యవహారాలు చూసుకోవడానికి, నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో తన కవరేజ్ కోసం హీరో రామ్ చరణ్ ఓ ముంబాయి సంస్థకు బాధ్యతలు అప్పగించాడు. ఇది ధృవకు ముందు వార్త. అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఇప్పుడు బ్యాచ్ కు బై బై చెప్పేసాడన్నది.

ఈ జనాల బిల్లు కాస్త భారీగానే లక్షల్లో అయిందని తెలుస్తోంది. కానీ ఆ టీమ్ వల్ల ఫలితం మాత్రం అంతంత మాత్రంగా వుందని వినికిడి. మరి ఈ కారణంగానో, ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు, మళ్లీ సినిమా విడుదల టైమ్ దాకా అనో, ఆ టీమ్ కు రామ్ చరణ్ స్వస్తి చెప్పేసాడని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ మైత్రీ మూవీస్ లో రంగస్థలం 1985 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలలు టైమ్ వుంది. అంతవరకు మీడియా, పబ్లిసిటీ వ్యవహారాలు ఏవీ అవసరం లేదు. బహుశా అందుకే కావచ్చు రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకుని వుంటాడు.

Show comments