అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'డిజె - దువ్వాడ జగన్నాథమ్' సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 'శరణం భజే..' అంటూ సాగే ఆడియో సింగిల్ని విడుదల చేసేశారు. తాజాగా మరో ఆడియో సింగిల్ నేడు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. 'గుడిలో బడిలో మడిలో..' అంటూ సాగుతుంది ఈ ఆడియో సింగిల్. పక్కా మాస్ సాంగ్ అట ఇది.
ఇక, 'గుడిలో బడిలో మడిలో..' సాంగ్కి సంబంధించి ఓ స్టిల్ని రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. అల్లు అర్జున్ అంటే డాన్స్కి కేరాఫ్ అడ్రస్. సూపర్బ్ సిగ్నేచర్ స్టెప్స్ ఈ సాంగ్లో వుంటాయని స్టిల్ని చూస్తే అర్థమవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
అల్లు అర్జున్ సినిమా అనగానే, దేవిశ్రీప్రసాద్కి కొత్త ఎనర్జీ వచ్చేస్తుంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. అన్నిటికీ మించి, అల్లు అర్జున్ డాన్సులతో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పోటీ పడ్తుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి 'డిజె - దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని 'గుడిలో బడిలో మడిలో' ఆడియో సింగిల్ విడుదల కానుంది.