కేన్స్ లో ల్యాండ్ అయ్యారు..

ఏటా ఘనంగా జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ ఇయర్ కూడా ప్రారంభమైంది. ఈనెల 28 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఎప్పట్లానే బాలీవుడ్ నుంచి కొందరు తారలు హాజరవుతున్నారు. దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, శృతిహాసన్ లాంటి తారలు ఇప్పటికే కేన్స్ లో ల్యాండ్ అవ్వగా.. ఐశ్వర్యరాయ్, సోనమ్ కపూర్ ఇంకొన్ని గంటల్లో అక్కడ ప్రత్యక్షం కానున్నారు. ఈసారి మాత్రం ఈ ముద్దుగుమ్మల్లో ఎవరి బాధలు వాళ్లకున్నాయి.

బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ప్రియాంక. మరో 10 రోజుల్లో విడుదలకానున్న ఈ సినిమాకు మరింత ప్రమోషన్ కల్పించేందుకు కాన్స్ లో దిగింది ప్రియాంక. అటు శృతిహాసన్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. ఆమె చేయబోతున్న సంఘమిత్ర సినిమాను కేన్స్ లో లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శృతిహాసన్... లండన్ లో ప్రత్యేకంగా కత్తియుద్ధం, గుర్రపుస్వారి నేర్చుకుంది.

మరోవైపు దీపిక పదుకోన్ కూడా కేన్స్ లో ప్రత్యక్షమైంది. ఇప్పటికే హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రముఖులంతా హాజరయ్యే కేన్స్ లో మరిన్ని పరిచయాలు పెంచుకొని, మరో హాలీవుడ్ మూవీ చేజిక్కించుకోవాలనేది దీపిక ప్లాన్.

వీళ్లతో పాటు ఐశ్వర్యరాయ్, సోనమ్ కపూర్ కూడా కేన్స్ లో మెరవబోతున్నారు. తనలో ఇంకా గ్లామర్ తగ్గలేదని ఐష్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉంటే.. ఉన్న క్రేజ్ ను కాపాడుకోవడం కోసం సోనమ్ కపూర్ కేన్స్ కు వెళ్తోంది.

Show comments