ఈ స్టంట్స్‌ అవసరమా మనోజ్‌.?

తన సినిమాల్లో తానే స్టంట్స్‌ చేసుకోవడం మంచు మనోజ్‌కి చాలా చాలా ఇష్టం. ఆ స్టంట్స్‌ సరే, సోషల్‌ మీడియాలో ఈ పబ్లిసిటీ స్టంట్స్‌ ఏంటట.? పొద్దునే, సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి.. కొద్ది గంటల్లోనే మంచు మనోజ్‌ మనసు మార్చుకున్నట్లు వ్యవహరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి.? ఏమోగానీ, ఈ మొత్తం ఎపిసోడ్‌తో మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో క్రెడిబులిటీ కోల్పోయాడు. 

'ఒక్కడు మిగిలాడు' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మనోజ్‌, అది కాకుండా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు.

ఆ సినిమా వివరాల్ని ప్రకటించడానికి, ఇప్పుడు మనోజ్‌కి మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే, తాను నటనకు దూరమవుతానని చేసిన ట్వీట్‌ పట్ల విమర్శలు వెల్లువెత్తడం, ఆందోళన వ్యక్తమవడం.. ఇవన్నీ తనను కన్‌ఫ్యూజన్‌లో పడేశాయని మనోజ్‌ చెప్పుకొచ్చాడు. 

'గుడ్‌ బై' ట్వీట్‌ని తీసేసి, ఆ తర్వాత మూడు ట్వీట్లలో కొత్త సినిమా చేయబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. 'ఓం శాంతి..' అని కూడా పేర్కొన్నాడు.

అది మనోజ్‌ తదుపరి సినిమా టైటిల్‌ అనుకోవాలా.? లేదంటే, నటన మీద వైరాగ్యం అనుకోవాలా.? అదేమీ కాదు, ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్‌ అనుకోవాలా.? ఏమోగానీ, మనోజ్‌కి అనూహ్యంగా మీడియాలో బోల్డంత కవరేజ్‌ దక్కింది 'నటనకు గుడ్‌ బై చెబుతున్నా..' అన్న ట్వీట్‌తో. సో, దీన్ని పబ్లిసిటీ స్టంట్‌గానే పరిగణించాలేమో. 

Show comments