లేడీ డైరక్టర్ తో చైతూ?

కొత్త దర్శకుడితో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చేసి, ఆగస్టులో విడుదలకు సిద్దమయిపోతున్నాడు నాగ్ చైతన్య.  అదే సమయంలో మరో రెండు మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

ప్రేమమ్ దర్శకుడు చందుమొండేటితో మైత్రీ మూవీస్ కు ఓ సినిమా చేయడానికి ఇప్పటికే ఓకె చేసేసాడు నాగ్ చైతన్య. అదే ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారికి ఓక సినిమా చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

కృష్ణవంశీ దగ్గర అసోసియేట్ గా సౌజన్య అనే మహిళా దర్శకురాలు చెప్పిన లైన్ కు ఓకె అన్నట్లు, ఆ లైన్ ను ఇప్పుడు డెవలప్ చేసి ఫుల్ స్క్రిప్ట్ గా మార్చే పని జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు అయితే ఈ రెండు సినిమాలకు ముహూర్తాలు ఆగస్టు నెలలోనే వుండే అవకాశం వుంది. కొంత షూట్ చేసి, కాస్త గ్యాప్ ఇచ్చి, అక్టోబర్ లో చైతూ-సమంతల పెళ్లి తరువాతే పూర్తి చేస్తారు.

ఇదిలా వుంటే యుద్ధం శరణం సినిమా నిర్మించిన సాయి కొర్రపాటితోనే మరో సినిమా కూడా చేయడానికి చైతూ సూత్రప్రాయంగా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. 

సరైన డైరక్టర్, సరైన స్క్రిప్ట్ వుంటే వారాహిలో మరో సినిమా వరుసగానే చేస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద యంగ్ హీరోల్లో చైతూ కెరీర్ పీక్స్ లోనే వున్నట్లు కనిపిస్తోంది.

Show comments