డీజే ఆడియో ఫంక్షన్.. బన్నీ ముందు జాగ్రత్త

బన్నీ ఇప్పుడేం చేసినా ఓ విషయాన్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. "చెప్పను బ్రదర్" అన్న పాపానికి ప్రతిసారి ఏదో ఒక వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నాడు ఈ అల్లువారబ్బాయ్. మొన్నటికిమొన్న డీజే టీజర్ ను పవన్ ఫ్యాన్స్ డిస్-లైక్స్ తో చీల్చిచెండాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి టైమ్ లో సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ పెడుతున్నారు. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో..?

ఈ భయం బన్నీకి కూడా ఉంది. అందుకే ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ఎవరికి పాసులు ఇవ్వాలనే విషయంపై కూడా ఈ హీరో ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. మెగాఫ్యాన్స్ లో పవన్ ఫ్యాన్స్ ను సైడ్ చేసే కార్యక్రమం ఇప్పటికే ముగిసింది. ప్రత్యేకంగా పరిశీలించి మరీ ఫ్యాన్స్ కు పాసులు ఇస్తున్నారు. అంతేకాదు.. ఈసారి డూప్లికేట్ పాసులు రాకుండా బార్ కోడ్ సిస్టమ్ కూడా పెట్టారు.

ఆడియో ఫంక్షన్ లో ఎవరూ పవర్ స్టార్ అనే నినాదం చేయకూడదు. అదే బన్నీ టార్గెట్. అందుకే తనకు బాగా క్లోజ్ గా ఉన్న అభిమాన వర్గాలకే పాసులు ఎక్కువగా కేటాయించాడు. వాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు రావు. మరి మీడియాకు ఇచ్చిన బల్క్ పాసుల సంగతేంటి.?

ఇక్కడ కూడా బన్నీ చెప్పాల్సిన విషయాన్ని ముందే మీడియాకు చెప్పేశాడట. ఎవరు ఏ హీరో ఫ్యాన్ అనే విషయాన్ని కనుక్కొని పాసులు ఇవ్వాలని సూచించాడట. కేవలం పవన్ ను దృష్టిలో పెట్టుకొని బన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Show comments