మెగా కాంపౌండ్‌లో బాస్కర్‌ కొత్త హీరో ఎవరు.!

బొమ్మరిల్లు భాస్కర్‌, మెగా కాంపౌండ్‌లో ఎప్పుడో అడుగు పెట్టేశాడు. అప్పట్లో ‘పరుగు’, ‘ఆరెంజ్‌’ సినిమాల్ని చేశాడు భాస్కర్‌. ‘పరుగు’ సినిమాలో అల్లు అర్జున్‌ హీరో కాగా, ‘ఆరెంజ్‌’ సినిమాలో రామ్ చరణ్‌ హీరో. ఇద్దరికీ పెద్ద షాకులే ఇచ్చాడు భాస్కర్‌ అప్పట్లో. కాస్త ‘పరుగు’ బెటర్‌ ఏమో, ‘ఆరెంజ్‌’తో పోల్చి చూస్తే. 

అయినాసరే, మెగా క్యాంప్‌ మళ్ళీ భాస్కర్‌కి ఆహ్వానం పలుకుతోంది. మెగా కాంపౌండ్‌లో భాస్కర్‌, సినిమా చేయడం దాదాపు ఖాయమైపోయింది. అయితే హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘పరుగు’ సీక్వెల్‌ని అల్లు అర్జున్‌తో భాస్కర్‌ చేయబోతున్నాడనీ, అల్లు శిరీష్‌తో కొత్త సినిమా భాస్కర్‌ చేయబోతున్నాడనీ, ఇవేవీ కాదు.. సాయిధరమ్ తేజతో భాస్కర్‌ ఓ సినిమా చేస్తాడనీ కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ వచ్చిపడుతున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే భాస్కర్‌ ఫ్లాప్‌ డైరెక్టర్‌గా ముద్ర వేయించేసుకున్నాడు. ‘ఒంగోలు గిత్త’ తర్వాత భాస్కర్‌ కెరీర్‌ మరీ డల్‌ అయిపోయింది. అయినా, మెగా కాంపౌండ్‌లోకి భాస్కర్‌కి ఆహ్వానం అందడమంటే చిన్న విషయమేమీ కాదు. దీనంతటికీ కారణం అల్లు అర్జునేనట. అయితే, ఈ టైమ్ లో అల్లు అర్జున్‌ - భాస్కర్‌తో సినిమా చేయడం దాదాపు అసాధ్యమే. సాయిధరమ్ తేజ, శిరీష్‌లలో ఎవరో ఒకరు మాత్రం భాస్కర్‌తో సినిమా చేయడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది.

Show comments