26న ధృవ పబ్లిక్ ఫంక్షన్

రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో విడుదలకు రెడీ అయింది ధృవ. డిసెంబర్ 9న డేట్ ప్రకటించేసారు. అయితే ఈ సినిమాకు అడియో ఫంక్షన్ జరగలేదు. అడియోను నేరుగా ఆన్ లైన్ లో వదిలేసారు. అందుకే ఇప్పుడు అడియో సక్సెస్ మీట్ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న ధృవ అడియో సక్సెస్ మీట్ ను వీలయినంత భారీగా చేయాలని భావిస్తున్నారు. 

లిమిటెడ్ గేదరింగ్ తో కాకుండా, పబ్లిక్ గా కాస్త భారీగా చేయాలని భావిస్తున్నారట. అందుకోసం వెరైటీగా వెన్యూ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా అయితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ ఫంక్షన్ తో ధృవకు మరింత హైప తీసుకురావాలన్నది ఆలోచన. మెగాస్టార్ చిరు ఎలాగూ చీఫ్ గెస్ట్ గా వస్తారు. సో, ఇక ఫ్యాన్స్ సందడికి అవధులు వుండవు. మరి పవర్ స్టార్ కూడా వస్తేనా...? అబ్బో.

Show comments