సెప్టెంబర్ 29కి బాలయ్య ఫిక్స్ అంట

ఒక రీలు అటయినా, ఒక షాట్ ఇటయినా సరే, అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 29కి బాలయ్య-పూరిజగన్నాద్ పైసా వసూల్ సినిమా విడుదల ఫిక్స్ అయిపోయిందట. 

దర్శకుడు పూరిజగన్నాధ్, హీరో బాలయ్య ఆ డేట్ కే ఫిక్సయిపోయారట. ఎప్పటికప్పడు ఎడిట్ చేసుకుంటూ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో పోర్చుగల్ నుంచి ఇండియాకు తిరిగివస్తోంది పైసా వసూల్ టీమ్.

వస్తూనే మళ్లీ సెట్ మీదకు వెళ్లిపోతారట. కేవలం 15 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ అయిపోతుందట. ఈ వర్క్ లోనే ఓ అయిటమ్ సాంగ్ కూడా వుందట. అంటే జూలై ఫస్ట్ వీక్ లోగానే టాకీ, సాంగ్స్ మొత్తం ఫినిష్ అయిపోతాయన్న మాట.

అక్కడికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కోసం 50 రోజుల టైమ్ వుంటుంది. పూరి లాంటి డైరక్టర్ కు ఇది చాలా అంటే చాలా ఎక్కువ.

సంక్రాంతికి ఓ సినిమా ఇచ్చి, ఇప్పుడు దసరాకు మరో సినిమా ఇస్తున్న బాలయ్య ఉగాదికి మరో సినిమా ఇవ్వడానికి కేఎస్ రవికుమార్ డైరక్షన్ సినిమా మీదకు ఆ వెంటనే వెళ్లిపోతాడట. బాలయ్య స్పీడ్ చూసి, యంగ్ హీరోలు తమ ప్లానింగ్ ను మార్చుకోవాలేమో?

Show comments