ఎక్స్ క్లూజివ్..పవన్ జాలీ ఎల్లెల్బీ

పవన్ అభిమానులకు ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓకె చేసారు. హిందీలో హిట్ అయిన జాలీ ఎల్లెల్బీ సినిమా రీమేక్ లో ఆయన నటించబోతున్నారు. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకు దిగ్దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించబోతున్నారు. అయితే దర్శకుడు ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది తెలియదు.

ఇటీవలే హారిక హాసిని సంస్థ పెద్ద మొత్తం వెచ్చింది ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేయడానికి ముందు పవన్, తన సన్నిహితుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమాను చూసి, ఓకె చేస్తా అని చెప్పినట్లు తెలిసింది. త్రివిక్రమ్ మాటలు రాస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఏకంగా కోటి డెభై లక్షలు ఈ సినిమా రీమేక్ కోసం ఖర్చు చేసారు. నిజానికి ఆ సినిమా హక్కులకు అంత మొత్తం అవసరమా? అన్నది అనుమానం. కానీ హారిక హాసిని లాంటి పెద్ద బ్యానర్, పవన్, త్రివిక్రమ్ లాంటి పేర్లు వుండడంతో హక్కుల రేట్లు కూడా ఆ మాత్రం రేంజ్ కు చేరుకున్నాయి.

Show comments