సెప్టెంబర్ ఫైట్.. వారానికో పెద్ద సినిమా

సంక్రాంతి తర్వాత అతిపెద్ద బాక్సాఫీస్ వార్ మళ్లీ సెప్టెంబర్ లో షురూ కానుంది. వారానికో పెద్ద సినిమా విడుదలకాబోతోంది. ఇప్పటికే పైసా వసూల్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా, జై లవకుశ సినిమాకు కూడా దాదాపు డేట్ ఖరారైంది. వీటితో పాటు మరో 2 సినిమాలు కూడా సెప్టెంబర్ లోనే థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

బాలకృష్ణ-పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పైసా వసూల్ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయబోతున్నారు. ఈ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలో మరో 2 పెద్ద సినిమాలు థియేటర్లకు క్యూ కట్టాయి.

మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా సెప్టెంబర్ లోనే విడుదలకానుంది. దసరాకు వస్తున్నామంటూ స్వయంగా మహేష్ ప్రకటించాడు. ఇప్పటికే వాయిదాపడుతున్న ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించడానికి ఇష్టపడడం లేదు. కాస్త కాంపిటిషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగాలనే చూస్తున్నారు. 

ఈ పోటీకి ఇప్పుడు రవితేజ కూడా తోడయ్యాడు. ఏడాది లాంగ్ గ్యాప్ తర్వాత ఒకేసారి 2 సినిమాలు స్టార్ట్ చేశాడు ఈ హీరో. వాటిలో ఒక సినిమా రాజా ది గ్రేట్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రవితేజ. అందుకే పెద్ద సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ.. దసరా సీజన్ లోనే థియేటర్లలోకి రావాలని చూస్తున్నాడు.

Show comments