ఇంతకూ ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో?

సెలబ్రిటీలు గతంలోలా ఇప్పుడు తమ భావోద్వేగాలు అణచుకోవడం లేదు. ట్విట్టర్ సాక్షిగా తమ భావాలను టక్కున వెలిబుచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఫైర్ బ్రాండ్ కుష్ బూ వంతు వచ్చింది. అసలే ఆమె సెంటీ మీటర్ కూడా వెనక్కు తగ్గదు. మాటకు మాట పడేయాల్సిందే. 

మరి ఎవరేమన్నారో, ఎందుకన్నారో కానీ, నిన్నటికి నిన్న కాస్త గట్టిగానే ట్వీట్ చేసింది. ''...వెర్రివెధవలూ..నేను పుట్టుకతో ముస్లిమ్ ను, హిందూను ఓ ప్రత్యేక చట్టం ప్రాతిపదికగా పెళ్లిచేసుకున్నా..నా మతం ఏమీ మార్చేసుకోలేదు..అలా అని చెప్పి నేను ఏ మతాన్నిఅనుసరించను.మానవతను తప్ప..'' అంటూ ట్వీట్ చేసింది కుష్ బూ. 

మరి ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు కుష్ బూ ఇలా ఎందుకు తన మతం, మానవతం అంటూ ధ్వజమెత్తాల్సి వచ్చిందో?

Show comments