ప్రభాస్ కు అదిరిపోయే కథ రెడీ

బాహుబలి సినిమా మీదకు వెళ్లి, రెగ్యులర్ ఫార్మాట్ మూవీకి దూరమైపోయాడు హీరో ప్రభాస్. రన్ రాజా రన్ సినిమా డైరక్టర్ సుజిత్ ఓ సబ్జెక్ట్ ఓకె చేసాడు. అది చేయాల్సి వుంది. అలాగే తమ బ్యానర్ లో జిల్ సినిమా చేసిన డైరక్టర్ కె కె రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తానని గతంలో మాటిచ్చాడు ప్రభాస్. 

ఈ మేరకు రాధాకృష్ణ ఓ మాంచి సబ్జెక్ట్ తయారుచేసాడట. ఇటీవలే హీరో ప్రభాస్ కు వినిపించినట్లు తెలుస్తోంది. తన కోసం తయారైన సబ్జెక్ట్ విన్న ప్రభాస్ ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ వేళకు ప్రభాస్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలకు రెడీ అయిపోతాడు.

మరి అప్పుడు సుజిత్, రాధాకృష్ణ ఇద్దరి సినిమాలు ఒకదాని తరువాత ఒకటే, సమాంతరంగానో సెట్ మీదకు తీసుకెళ్లడానికి యువి క్రియేషన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి.

Show comments