శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురు పెళ్లిలో వాళ్లే హైలెట్

స్వయంగా చిరంజీవి హాజరయ్యారు ఈ పెళ్లికి. పవన్ కల్యాణ్ కూడా వచ్చాడు. అందగాడు మహేష్ బాబు కూడా ఎటెండ్ అయ్యాడు. వీళ్లతో పాటు అల్లు అర్జున్, వెంకటేశ్, రాజమౌళి, సాయిధరమ్ తేజ్ లాంటి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహానికి. కానీ ఇంతమందిలో హైలెట్ అయింది మాత్రం ఇద్దరంటే ఇద్దరే. వాళ్లే ప్రభాస్, రామ్.

బాహుబలి-2 విజయం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగిందో చెప్పడానికి ఈ పెళ్లి ఎగ్జాంపుల్ గా మారింది. ప్రముఖులంతా ప్రభాస్ చుట్టూ చేరిపోయారు. చాలామంది సెల్ఫీలు కూడా దిగారు. దీనికి తోడు సాహో సినిమా కోసం మేకోవర్ ప్రయత్నిస్తున్న ప్రభాస్ ను చూసేందుకు అందరూ ఎగబడ్డారు. 

ప్రభాస్ తర్వాత ఎక్కువగా ఆకర్షించిన హీరో రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్, ఆ మూవీ కోసం కొత్తగా తయారైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే గెటప్ తో పెళ్లికి వచ్చిన రామ్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఫుల్ హెయిర్, స్టయిలిష్ గడ్డంతో రామ్ లుక్ అదిరిపోయింది.

Show comments