అవును, హీరో కార్తీ భయపడ్డాడు. ఆ భయం కూడా 'కాష్మోరా' గురించే. ఎందుకంటే, ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది మరి. 50 కోట్ల పైన బడ్జెట్తో 'కాష్మోరా' తెరకెక్కుతుండడంతో అప్పుడప్పుడూ కార్తీ భయపడేవాడట. ఆ స్థాయిలో బడ్జెట్ అయితే, వసూళ్ళ పరంగా గొప్ప విజయమే సాధించాలి గనుక, తన వైపు నుంచి షూటింగ్కి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట కార్తీ.
'నిర్మాత బాగుంటేనే మేం బాగుంటాం..' అని తాను నమ్ముతానంటున్న కార్తీ, సినిమాలో కంటెంట్కి తగ్గట్టుగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక, 'కాష్మోరా' సీరియస్ ఫిలిం ఎంతమాత్రం కాదనీ, చిన్న పిల్లలు సైతం ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చనీ చెబుతున్నాడు. కానీ, 'కాష్మోరా' అంటే దెయ్యాలే గుర్తుకొస్తాయి. తెలుగులో 'కాష్మోరా' అన్న పేరుకున్న ప్రత్యేకత అలాంటిది.
శ్రీదివ్య, నయనతార ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మొత్తమ్మీద, బడ్జెట్ విషయంలో బెంగపడ్డ కార్తీ, సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందంటూ కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'కాష్మోరా' సినిమాపై కార్తీ అంచనాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.