అబ్బే.. జూ.ఎన్టీఆర్‌ ఏమాత్రం తగ్గలేదు.!

ఇంకో ఐదు రోజుల్లో షూటింగ్‌ ప్రారంభమవుతుంది.. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏమాత్రం తగ్గలేదు. కాస్త ఒళ్లు తగ్గించి తన కొత్త సినిమా 'జై లవ్‌ కుశ' సినిమాలో ఎన్టీఆర్‌ కన్పించబోతున్నాడంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. కానీ, సినిమా ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్‌ మామూలుగానే వున్నాడు. బాబీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమయ్యింది. వినాయక్‌, హరికృష్ణ తదితరులు ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 

'టెంపర్‌' సినిమా కోసం ఫిట్‌గా కన్పించిన ఎన్టీఆర్‌, 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఫర్వాలేదన్పించాడు. 'జనతా గ్యారేజ్‌' సినిమాకొచ్చేసరికి ఒళ్ళు చేసేశాడు. ఇప్పుడు అదే ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తున్నట్టున్నాడు. బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కోసం మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో ఎన్టీఆర్‌ కన్పిస్తాడనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఇందుకోసం గట్టిగా కసరత్తులు చేసేస్తున్నాడనీ, బాగా ఒళ్ళు తగ్గించేస్తున్నాడనీ గుసగుసలు విన్పించినా, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. 

ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించడం ఖరారయ్యింది. మరో హీరోయిన్‌గా నివేదా థామస్‌ పేరుని పరిశీలిస్తున్నారు. ఇంకో హీరోయిన్‌ వేట ప్రస్తుతం కొనసాగుతోంది. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తారట.

Show comments