భలే అయిడియా బాహుబలీ?

మార్కెటింగ్ స్ట్రాటజీలు భలేగా వుంటాయి. జనాల జేబుల్లో డబ్బులు లాగేయాలంటే చాలా తెలివితేటలు వాడేయాలి. బాహుబలి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఇదే చేస్తున్నారు. బాహబలి పార్ట్ 2 విడుదలకు మూడు వారాల ముందుగా పార్ట్ వన్ ను విడుదల చేస్తున్నారు. అది కూడా వెయ్యికి పైగా థియేటర్లలో. పార్ట్ వన్ మీద కరణ్ జోహార్ బాగానే డబ్బులు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా చేసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికే బోల్డు సార్లు బాహుబలి టీవీల్లో వచ్చింది. పార్ట్ 2 వస్తోంది. ఇప్పుడు బాహుబలి పార్ట్ వన్ చూసేవాళ్లు ఎంత మంది వుంటారు. అందుకే ఓ మహత్తరమైన ప్లాన్ వేసారు. పార్ట్ వన్ ఇప్పుడు టికెట్ కొని చూసిన వారికి, పార్ట్ 2 టికెట్ ను గ్యారంటీగా ఇప్పిస్తారట. అంటే పార్ట్ 2 సినిమా తొలివారంలో చూడాలనుకునేవారి కోసం పార్ట్ వన్ ను గ్యాలంగా వేస్తున్నారన్నమాట. అంటే బాహుబలి పార్ట్ టూ చూసే జనాల చేత పార్ట్ వన్ కూడా వీలయినంత చూపించి, మరి కొంచెం డబ్బులు చేసుకోవాలనుకుంటున్నారన్నమాట. భలే అయిడియా.

అన్నట్లు ఈ స్కీమ్ ఓన్లీ నార్త్ కే నంట. సౌత్ కు కాదు.

Show comments