మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ కాన్ఫిడెన్స్ దెబ్బ తినేసింది. అఖిల్ రిలీజ్కి ముందు విపరీతమైన కాన్ఫిడెన్స్తో, నెక్స్ట్ సూపర్స్టార్ తానే అన్నట్టుండేవాడు అక్కినేని అఖిల్. కానీ ఆ చిత్రం అతడిని నేల మీదకి తెచ్చేసింది. హిట్టు కొట్టడం ఎంత కష్టమనేది తెలియజెప్పింది. దాంతో డిఫెన్స్లో పడ్డ అఖిల్ రెండవ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.
ఈ చిత్రానికి 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ని ఫైనలైజ్ చేసిన నాగార్జున దీని పూర్తి బాధ్యతలు అతని మీదే పెట్టేసాడట. ఈ చిత్రానికి సంబంధించి ఎందులోను కలగజేసుకోకూడదని, విక్రమ్కి పూర్తి స్వేఛ్ఛనిచ్చి అతడి నుంచి అదిరిపోయే క్వాలిటీ ప్రాడక్ట్ రాబట్టాలని నాగార్జున నిర్ణయించుకున్నారట. తన బ్యానర్లో తీసే ఏ సినిమా విషయంలో అయినా నాగార్జునదే ఫైనల్ కాల్. కానీ ఈసారి విక్రమ్కే ఆ హక్కులు ఇచ్చేసాడట.
అతను ఏది అడిగితే అది ప్రొవైడ్ చేయమని తన ఫైనాన్స్ టీమ్కి ఆదేశాలిచ్చి, విక్రమ్ కుమార్పై రెస్పాన్సిబులిటీ మొత్తం మోపేసాడట. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే విక్రమ్ కుమార్ ఒక చిరస్మరణీయ చిత్రం అందించగలడనేది నాగార్జున నమ్మకం. అందుకే అఖిల్కి అత్యంత కీలకమైన ఈ చిత్రాన్ని అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో వుంచి నాగ్ రిలాక్స్ అయిపోయాడు.