ఈసారి నిఖిల్ తో ఒప్పందం కుదురుతుందా!

ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మించే పద్ధతి షురూ చేసింది ఏకే ఎంటర్ టైన్ మెంట్స్. హీరో రాజ్ తరుణ్ తో వరుసపెట్టి సినిమాలు నిర్మించింది. ఇప్పుడీ బ్యానర్ నిఖిల్ పై ఫోకస్ పెట్టింది. కుదిరితే నిఖిల్ తో కూడా వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటోంది.

తాజాగా నిఖిల్ తో ఓ సినిమా ప్రకటించింది ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. కన్నడంలో హిట్ అయిన కిర్రాక్ పార్టీ రీమేక్ అది. ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ కూడా చేపడుతోంది. త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ సినిమా.

ఇదిలా ఉండగా బ్యాక్ టు బ్యాక్ 3సినిమాల అగ్రిమెంట్ ప్రతిపాదనను నిఖిల్ కు కూడా వినిపించిందట ఈ నిర్మాణ సంస్థ. గతంలో రాజ్ తరుణ్ తో ఇలానే సినిమాలు నిర్మించిన విషయాన్ని గుర్తుచేసిన ఈ సంస్థ.. నిఖిల్ కు ఒకేసారి భారీ మొత్తం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే ఈ ప్రపోజల్ కు నిఖిల్ ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది.

ఒప్పందానికి ఓకే చెబితే ఇదే బ్యానర్ లో వరుసగా 3సినిమాలు చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఏదైనా బ్లాక్ బస్టర్ తగిలి మరో బడా నిర్మాత, భారీ చెక్ ఆఫర్ చేసినప్పటికీ అటు మొగ్గుచూపే అవకాశం ఉండదు.

Readmore!

ప్రస్తుతం వరుసగా హిట్స్ వస్తున్నాయి. మార్కెట్ రేంజ్ పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో లాక్ అయిపోవడం ఎందుకని ఆలోచిస్తున్నాడు నిఖిల్.

Show comments