టాలీవుడ్ కు ఊపిరి ఆడింది

ఈ శుక్రవారం ఫలితం కోసం టాలీవుడ్ కాస్త ఆసక్తిగా చూసింది. ఈవారం విడుదలయ్యే సినిమాలకు జనం వస్తారా? రారా? ఇంకా నోట్ల మార్పిడి పనిలో బిజీగా వున్న జనం థియేటర్లకు వస్తారా? రారా? అని అనుమాన పడ్డారు. కానీ గత శుక్రవారంతో పోల్చుకుంటే, ఈ శుక్రవారం జనాలు బాగానే థియేటర్లకు వచ్చారు. వి

శాఖ, ఈస్ట్, వెస్ట్ ల్లో చాలా చోట్లు ఫుల్స్, కొన్ని చోట్ల 80 పర్సంట్ వరకు కలెక్షన్లు కనిపించాయి. దీంతో టాలీవుడ్ జనాలకు ఊపిరి ఆడింది. ఇప్పుడు చకచకా విడుదల తేదీలు ప్రకటించే పనిలో వున్నారు. దిల్ రాజు బ్యానర్ ను తీసుకున్న రెమో సినిమా ముందుగా డేట్ ను 25న విడుదల అంటూ ప్రకటించింది. 

రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా డిసెంబర్ 9 అంటూ ప్రకటించాలని చూస్తోంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ కూడా 2 లేదా 9న రావాలని చూస్తోంది. సో మళ్లీ టాలీవుడ్ విడుదలలకు కాస్త కళ వచ్చినట్లే.

Show comments