ధృవ నిర్మాత టెన్షన్?

భారీ ఖర్చుతో ధృవ సినిమాను నిర్మిస్తున్నారు అల్లు అరవింద్  అండ్ ఎన్ వి ప్రసాద్ కలిసి. ఇప్పటి దాకా ధృవ బిజినెస్ క్లోజ్ కాలేదు. దాంతో ఈ సినిమాకు ఇరవై కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన ఎన్ వి ప్రసాద్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇరవై కోట్ల టెన్షన్ కాదు. ఆయన పరోక్షంగా చిరు 150 వ సినిమాపై కూడా కాస్త పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. 

అలాగే మరోపక్క మహేష్ బాబు సినిమా కు కూడా ఆయన భారీ పెట్టుబడి పెడుతున్నారు. ఏ సినిమా కూడా ఇప్పటి దాకా మార్కెట్ స్టార్ట్ చేయలేదు. అన్నింటికన్నా ముందు విడుదలకు రెడీ అయింది ధృవ నే. ఇది కూడా అమ్మకుండా అరవింద్, ఎన్వీప్రసాద్ ఏరియాల వారీ స్వంత డిస్ట్రిబ్యూషన్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

నైజాం, ఈస్ట్, కృష్ణా గీతా సంస్థ, సీడెడ్ ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తారని వినికిడి. అంటే సినిమా విడుదల అయ్యేవరకు చేతిలోకి పైసలు రావు. దాంతో టెన్షన్ పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి  డైరక్షన్ లో ముస్తాబతవుతున్న ధృవ సినిమా డిసెంబర్ 2 లేదా 9న జనం ముందుకు వస్తుంది. 

Show comments