మెల్లగా జారుకున్న వెంకీ దర్శకులు

వాస్తవానికి ఈపాటికి వెంకీ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలి. గురు సినిమా సెట్స్ పై ఉన్న టైమ్ లోనే ఇద్దరు ముగ్గురు దర్శకులు వెంకటేష్ చుట్టూ తిరిగారు. వాళ్లలో ఒకరికి ఈ సీనియర్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ వెంకీ మాత్రం సడెన్ గా ఖాళీ అయిపోయాడు. గురు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినా, ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోయాడు. మరి ఇన్నాళ్లూ వెంకీ చుట్టూ తిరిగిన దర్శకులు ఏమయ్యారు. 

గురు సినిమా కంటే ముందే కిషోర్ తిరుమల చెప్పిన కథకు ఓకే చెప్పాడు వెంకీ. గురు కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఒకరిద్దరు హీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేశారు. కానీ ఎందుకో ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. కిషోర్ తిరుమల మళ్లీ ఇప్పుడు రామ్ తోనే సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అటు పూరి జగన్నాధ్ కూడా అంతే. 

గురు సినిమా సెట్స్ పై ఉన్న టైమ్ లోనే పోకిరి స్టయిల్ లో మంచి మాస్ సబ్జెక్ట్ ఒకటి వెంకీకి వినిపించాడట పూరి. అప్పట్లో ఈ వార్త బాగానే చక్కర్లుకొట్టింది. కానీ కట్ చేస్తే, వెంకీ ఇప్పుడు బాలయ్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ లిస్ట్ లో క్రిష్ కూడా ఉన్నాడు. వెంకీ-క్రిష్ కాంబోలో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే క్రిష్ కూడా రూటు మార్చాడు. దీంతో వెంకీ నెక్ట్స్ సినిమాపై సేమ్ సస్పెన్స్ కొనసాగుతోంది.

Show comments