ఒవైసీ దేశభక్తితో ఆశ్చర్య పరిచాడు!

ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ సారి జెండా పండగ సందర్భంగా భారతీయులందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతవరకూ ఎమ్ఐఎమ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగలేదన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. అసద్ జాతీయ పతాకావిష్కరణ చేశాడు!  జాతీయ గీతాన్ని పాడి త్రివర్ణ పతకానికి సెల్యూట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే చాలా వివాదాస్పద ప్రకటనలు చేసిన చరిత్ర కలిగిన వారు ఒవైసీ సోదరులు. హిందువులను నరికేస్తాం.. చంపేస్తాం.. అంటూ తాటాకు చప్పుళ్లు చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అనేక వ్యాఖ్యానాలు చేయడంతో పాటు.. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన వారి తరపున వకాల్తా పుచ్చుకోవడం, ఆ నేరాల్లో ఎన్ కౌంటర్ అయిన వారి కుటుంబాలను పరామర్శించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

అంతే కాదు.. ఈ మధ్య నే ‘భారత్ మాతాకీ జై’ అని నినదించడంపై  కూడా ఒవైసీ కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. తన ప్రాణం ఉన్నంత వరకూ ఆ పని చేయనన్నట్టుగా ఒవైసీ వ్యాఖ్యానించినట్టున్నాడు. ఇలాంటి నేపథ్యంలో పాతబస్తీ పార్టీ అధినేత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆసక్తికరమైన అంశమే. తనకు జాతీయ గీతం కూడా వచ్చు అని ఒవైసీ నిరూపించుకోవడం విశేషమే. 

Show comments