ఇజమ్ ను ఆదుకున్న గ్యారేజ్

కళ్యాణ్ రామ్ ఇజమ్ సినిమా విడుదలకు దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది. డేట్ అనౌన్స్ మెంట్ మిగిలింది. బహుశా 22 శనివారం ఫిక్స్ కావచ్చు. 20న విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, ఆ రోజుతో జనతా గ్యారేజ్ 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. దాదాపుగా అదే థియేటర్లలో చాలా వరకు ఇజమ్ విడుదల కావాల్సి వుంది. అందువల్ల 21 అనుకున్నారు. కానీ ముహుర్తం అంత బాలేదని తెలుస్తోంది. అందుకే 22న విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు వినికిడి.

ఇదిలా వుంటే ఇన్నాళ్లు ఇజమ్ కు అమ్మకాలే సమస్య. బడ్జెట్ కాస్త ఎక్కువ కావడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరింది. ఓవర్ సీస్ ఇచ్చేసారు. నైజాం దిల్ రాజు, అలాగే ఆంధ్రలో జనతా గ్యారేజ్ విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లే ఎవరి ఏరియా వాళ్లు విడుదల చేస్తారు. మరి అడ్వాన్స్ లు ఇచ్చి, కమిషన్ పై విడుదల చేస్తున్నారో, కొన్నారో తెలియడం లేదు. అడ్వాన్స్ లు ఇచ్చి,కమిషన్ పైనే విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

ఈ డిస్ట్రిబ్యూటర్లంతా ఎన్టీఆర్ తో పరిచయాలు బాగా వున్నవాళ్లు కావడం, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చేసి వుండడం, రాబోయే ఎన్టీఆర్ సినిమాను చేయాలని ఆశిస్తుండడం వంటి కారణాలతో ఇజం ను తమ చేతుల్లోకి తీసుకుని, ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాాధ్ దర్వకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Show comments