తెలుగోడి చేతిలో యూఎస్ లో తెలుగు విద్యార్థి హత్య!

అమెరికాలో ఒక సాటి తెలుగువాడిని కత్తితో పొడిచి హత్య చేశాడొక యువకుడు. ఒకే రూమ్ లో ఉంటున్న వీళ్లు గొడవ పడినట్టుగా.. పర్యవసనంగా హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. హతుడి పేరు సంకీర్త్ కాగా, నిందితుడి పేరు సాయి సందీప్. నిన్న మధ్యాహ్నం సంకీర్త్ , సాయి సందీప్(ఫొటోలోని వ్యక్తి) లు గొడవపడినట్టుగా పోలీసు విచారణలో వెల్లడైంది.

ఈ ఘర్షణలో సంకీర్త్ ను సందీప్ కత్తితో పొడిచాడు. బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. మరో యువకుడి సాయంతో శవాన్ని కారులో తరలించే యత్నం చేస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యవహరం బయటకు వచ్చింది. 

నిందితుడు సాయి సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంకీర్త్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంకీర్త్ రెండు సంవత్సరాల కిందట ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లాడని తెలుస్తోంది. ఈ ఘటనతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Show comments