బాలయ్య, నాగ్‌ ఫ్రెండ్స్‌.!

'మా మధ్య ఎలాంటి మనస్పర్దలూ లేవు.. వివాదాలు అసలే లేవు.. మేమెప్పుడూ స్నేహంగానే వున్నాం.. మేమెప్పుడూ కలవబోమనీ, ఇద్దరి మధ్యా గొడవలున్నాయనీ ఏవేవో పిచ్చి ప్రచారాలు జరుగుతున్నాయి.. ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాను.. అవన్నీ గాలి వార్తలే..' 

- బాలకృష్ణతో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, నాగార్జున చెప్పిన తాజాగా మాటలివి. 

అయితే, గత కొంత కాలంగా ఇద్దరి మధ్యా విభేదాలున్నాయంటూ సినీ వర్గాల్లో పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ, నాగార్జున కలిసింది కూడా చాలా చాలా అరుదుగానే. ఎలాగైతేనేం, కాంగ్రెస్‌ ఎంపీ, కళా బంధు సుబ్బిరామిరెడ్డి 'టిఎస్‌ఆర్‌ అవార్డుల' వేడుకలో బాలకృష్ణ, నాగార్జున సందడి చేశారు. ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వేదికపైనా ఇద్దరూ కలిసిమెలిసి వున్నారు. అన్నట్టు, ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరయ్యారు. 

మరోపక్క, విశాఖలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమ అంతా తరలి వచ్చింది. ఇతర భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులూ ఈ వేడుకలో సందడి చేశారు. అవును మరి, అక్కడున్నది సుబ్బిరామిరెడ్డి. ఆయన పిలిస్తే రాకుండా వుంటారా ఎవరైనా.?

Readmore!

Show comments