బిగ్ బాస్ తో చేతులు కలిపిన జోగేంద్ర

ఈనెల 11న థియేటర్లలోకి రానుంది నేనే రాజు నేనే మంత్రి సినిమా. అన్నీ తానై ఈ మూవీకి ప్రచారం కల్పిస్తున్న రానా.. సినిమాకు కలిసొచ్చే ఏ చిన్న అంశాన్ని వదలట్లేదు. ఏఆర్ టెక్నాలజీ, యువగర్జన అంటూ కాస్త డిఫరెంట్ గా ప్రమోషన్ కల్పిస్తున్నారు ఈ సినిమాకి. ఇప్పుడు మరింత వెరైటీగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఏకంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తున్నాడు రానా. 

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే పూణె చేరుకున్నాడు రానా. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షోలో ప్రమోట్ అవుతున్న మొదటి మూవీగా నిలిచింది నేనే రాజు నేనే మంత్రి సినిమా. 

జోగేంద్ర క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయిన రానా బయట కూడా తెల్ల లుంగీతోనే కనిపిస్తున్నాడు. యువగర్జన(ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఈ పేరు పెట్టారు)లో లుంగీతో కనిపించిన రానా, సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు మ్యాగ్జిమమ్ ఇదే గెటప్ మెయింటైన్ చేస్తానని ప్రకటించాడు. పూణె వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు కూడా లుంగీలోనే కనిపించి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. 

తేజ దర్శకత్వంలో కాజల్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Show comments