ఐపీఎల్ హంగామా.. మాకొద్దు బాబోయ్..

మొన్నటికి మొన్న ఎమీ జాక్సన్ పై ఎన్ని సెటైర్లు పడ్డాయో అంతా చూశాం. ఐపీఎల్ ఓపెనింగ్ లో అతిచెత్త ప్రదర్శన ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఎమీ జాక్సన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు నెటిజన్లు. ఈసారి మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు పరిణీతి చోప్రా. ఐపీఎల్ ముగింపు ఉత్సవాల్లో పరిణీతి చోప్రా ఫినిషింగ్ టచ్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రావడమే ఆలస్యం.. ఎమీ జాక్సన్, పరిణీతి మధ్య కంపారిజన్స్ తీయడం స్టార్ట్ చేశారు. 

ఎమీ జాక్సన్ చేసిన చెత్త డాన్సు క్లిప్పింగులతో పరిణీతి గతంలో చేసిన కొన్ని డాన్స్ మూమెంట్స్ ను మిక్స్ చేస్తూ ఇప్పటికే కొన్ని వీడియోలు రెడీ అయిపోయాయి. ఇలా తనపై హంగామా స్టార్ట్ అయిందని తెలుసుకున్న వెంటనే పరిణీతి ఎలర్ట్ అయింది. ఐపీఎల్ లో తను ఎలాంటి ప్రదర్శన ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో "గోల్ మాల్ ఎగైన్" అనే సినిమా షూటింగ్ లో ఉన్నానని, తను ఐపీఎల్ వేదికపై ఎలాంటి ప్రదర్శన ఇవ్వడం లేదంటూ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చింది.  

ఐపీఎల్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ లపై ఆడియన్స్ లో చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గినా అభాసుపాలు కావాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు ఎమీజాక్సన్ ఎపిసోడ్ తో తారలెవరూ ఐపీఎల్ ఆఫర్లు ఒప్పుకోవడానికి ముందుకురావడం లేదు.

Show comments