నాగ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..!

ప్రస్తుతం రాజుగారి గది-2 సినిమా చేస్తున్నారు నాగార్జున. ఈ సినిమాతో కింగ్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఓంనమో వేంకటేశాయ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోవాలంటే రాజుగారి గది-2 సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. పైగా ఈ జానర్ లో నాగ్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.

రాజుగారి గది-2లో నాగార్జున చాలా లేట్ గా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్ కు కాస్త ముందే నాగ్ ఎంట్రీ ఉంటుందని టాక్. ఇదే కనుక నిజమైతే అది ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసే వార్తే. ఎందుకంటే.. సినిమా ప్రారంభం కాగానే తమ స్టార్ హీరో ఎప్పుడు తెరపైకొస్తాడా.. తెరపైకి కాగితాలు విసిరి, ఈలలు వేద్దామని అభిమానులు ఎదురుచూస్తుంటారు. వాళ్లను ఇంటర్వెల్ వరకు వెయిట్ చేయిస్తే కచ్చితంగా నిరాశ పడతారు.

అయితే ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మొత్తాన్ని నాగార్జున నడిపిస్తాడట. నాగ్ ఎంటరైన తర్వాతే హారర్ తో పాటు కామెడీ ట్రాక్ కూడా వస్తుందని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ లో నాగ్ పర్ఫార్మెన్స్, టైమింగ్ అదుర్స్ అంట. ఈ టైపు సినిమాతో నాగార్జున ఎలా మెప్పిస్తాడా అని అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Show comments