ఆ డైరక్టర్ తో మళ్లీ.. ఈసారి నలుగురు హీరోలు

మరోసారి గౌతమ్ మీనన్ తో వర్క్ చేయబోతున్నాడు నాగచైతన్య. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఏమాయచేసావె, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రెడీ అవుతోంది. ప్రస్తుతం గౌతమీ మీనన్ తో చర్చలు జరుగుతున్నాయని ప్రకటించాడు చైతూ.

గౌతమ్ మీనన్ సినిమాలంటే అవి ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతాయి. ఈ కొత్త ప్రాజెక్టు మాత్రం అంతకుమించి. అవును.. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట గౌతమ్ మీనన్. అంటే నాలుగు భాషల్లో నలుగురు హీరోలన్నమాట.

గౌతమ్ మీనన్ తో వర్క్ చేసిన ప్రతిసారి చైతూ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. అన్ని భాషల్లో సినిమా కంప్లీట్ అయి, ఒకేసారి విడుదల కావడం పెద్ద సమస్యగా మారింది. మొన్నటికి మొన్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా టైమ్ లో కూడా ఇలాంటి చిక్కులొచ్చే విడుదల ఆలస్యమైంది. అలాంటిది ఈసారి నలుగురు హీరోలతో నాలుగు భాషల్లో సినిమా అంటున్నాడు. మరోవైపు సమంతతో త్వరలోనే పెళ్లి పెట్టుకున్నాడు నాగచైతన్య. ఇలాంటి టైమ్ లో గౌతమ్ మీనన్ ప్రాజెక్టుకు ఓకే చెబితే లాక్ అయిపోయినట్టే...!

Show comments