మెగాస్టార్ సినిమాకు ముగ్గురు రచయితలు

"ఉయ్యాలవాడ" కోసం తెరవెనక భారీ కసరత్తు జరుగుతోంది. చాన్నాళ్ల కిందటే పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ కథకు తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి మార్పుచేర్పులు చేశాడు. కథ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్టే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో ముగ్గురు రచయితల్ని కూడా తీసుకున్నారు.

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కథతో పాటు డైలాగ్స్ చాలా కీలకం. అందుకే ఇప్పుడు స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారు. దీని కోసం రచయితలు వేమారెడ్డి, బుర్రా సాయిమాధవ్, మధు వర్క్ చేస్తున్నారు. వీళ్ల ముగ్గురితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సన్నివేశాలకు తగ్గట్టు 3-4 వెర్షన్ల డైలాగ్స్ రాయిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

అలా పోగైన డైలాగ్స్ నుంచి తమకు నచ్చినవాటిని చిరంజీవి, రామ్ చరణ్ సెలక్ట్ చేస్తారన్నమాట. రీసెంట్ డెవలప్ మెంట్స్ ప్రకారం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమాక్స్ పార్ట్ ను చిరంజీవి ఓకే చేశారట. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. ఈలోగా కంప్లీట్ మేకోవర్ అవ్వబోతున్నారు చిరు.

Show comments