సంఘమిత్రపై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్

సంఘమిత్ర సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్టు స్వయంగా ఆ సినిమా నిర్మాతలే ప్రకటించారు. అవాంఛనీయ కారణాల వల్ల శృతిహాసన్ ఈ మెగా బడ్జెట్ మూవీ నుంచి డ్రాప్ అయినట్టు నిర్మాతలు తెలిపారు. అయితే ఆ కారణాలేంటనే విషయంపై శృతిహాసన్ క్లారిటీ ఇచ్చేసింది. మేకర్స్ నుంచి తనకు సరైన రెస్పాన్స్ రాకపోవడం వల్లనే మూవీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది.

సంఘమిత్ర ప్రాజెక్టు కోసం అందరికంటే ముందు మెంటల్లీ, ఫిజికల్లీ ప్రిపేర్ అయింది తను మాత్రమే అని ప్రకటించింది శృతిహాసన్. దాదాపు ఏప్రిల్ నెలంతా లండన్ లో ఉండి ట్రయినింగ్ తీసుకున్నానని, సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కమిట్ మెంట్ చూపించానని.. కానీ ఆ కమిట్ మెంట్ యూనిట్ వద్ద లేదని నిందించింది. దాదాపు రెండేళ్ల పాటు షూట్ చేయాల్సిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు బౌండెడ్ స్క్రిప్ట్ తయారుచేయలేదని, ఒకవేళ చేసినా తనకు అందించలేదని శృతి ఆరోపిస్తోంది.

బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వకపోవడంతో పాటు డేట్స్ పై తనకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని శృతిహాసన్ తెలిపింది. డేట్ క్యాలెండర్ లేకుండా రెండేళ్లు షూటింగ్ ఎలా చేస్తాం అని ప్రశ్నించిన శృతిహాసన్.. యూనిట్ నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలిపింది. మరి శృతి కామెంట్స్ కు యూనిట్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Show comments